
జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా నియమిస్తూ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2047 నాటికి రాష్ట్రంలో అటవీ, చెట్ల కవరేజీని 50 శాతానికి పెంచడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలోని అటవీ శాఖ పరిధిలో ఈ నియామకం జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.