
పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు 4వ సచివాలయం పరిధిలో ప్రజా సమస్యలపై పర్యటించారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను 24 గంటల్లోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు.