
ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారం తీసుకుంటే ప్రత్యేకంగా మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణులు, వృద్ధులు లేదా పోషక లోపం ఉన్నవారికి మాత్రమే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు అవసరమవుతాయి.
వైవిధ్యమైన సమతుల్య ఆహారం తీసుకునే ఆరోగ్యవంతులు రోజూ మల్టీవిటమిన్ తీసుకోవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం తక్కువని వెల్లడించారు.