
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ సమీపంలోని సర్వే నంబర్ 325 భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు రైతులకు శనివారం నోటీసులు జారీ చేశారు.
మర్కుక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల పరిధిలో భూముల సర్వే కోసం ఐదు టీమ్స్ను ఏర్పాటు చేసి బౌండరీలను నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు.
మొదటి రోజు కొందరు రైతులు అధికారులను అడ్డుకోవడంతో, రెండో రోజు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు మరియు పెట్రోలింగ్ నిర్వహించారు.