
మహిళల ఆసియా కప్లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.
భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత పెవిలియన్ వైపు సైగలు చేస్తూ రెచ్చగొట్టేలా ప్రవర్తించినందుకు ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా జత చేశారు.
గత ఏడాది ఆగస్టు 6న ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత ఫాతిమా సనాకు డీమెరిట్ పాయింట్ పడటం ఇది రెండోసారి అని ఐసీసీ అధికారులు వెల్లడించారు.