
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ, కేబినెట్లో చోటు దక్కని ఎమ్మెల్యేలు యశవంతరాయగౌడ పాటిల్, బేలూరు గోపాలకృష్ణ తమ పదవులకు రాజీనామా చేశారు.
మొత్తం 20 మంది కొత్త మంత్రులను చేర్చుకునేందుకు సీఎం డీకే శివకుమార్ సిద్ధమవుతుండగా, మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో బెంగళూరులో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది.