
పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్లో ఓపెన్ మార్కెట్ బ్లాక్ డీల్ ద్వారా రూ. 2,949 కోట్ల విలువైన 3 శాతం వాటాను పలు దేశీ, విదేశీ సంస్థలు కొనుగోలు చేశాయి.
పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన రెసిలెంట్ అసెట్ మేనేజ్మెంట్ సగటున ఒక్కో షేరుకు రూ. 1,535.10 చొప్పున మొత్తం 1,92,10,110 ఈక్విటీ షేర్లను విక్రయించింది.
ఈ వాటాలను కొనుగోలు చేసిన వాటిలో గోల్డ్మెన్ శాక్స్, బీఎన్పీ పారిబాస్ వంటి విదేశీ సంస్థలతో పాటు ఎస్బీఐ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వంటి దేశీయ మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి.