
దేశంలోని 757 జిల్లాల అసంఘటిత రంగ డేటాను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మొత్తం శ్రామికుల్లో 78 శాతం మంది మహిళలతో తెలంగాణలోని నిర్మల్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
అలాగే ఈ జిల్లాలోని అసంఘటిత రంగ యూనిట్లలో దాదాపు 80 శాతం సంస్థలకు మహిళలే పూర్తి స్థాయి యజమానులుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.