
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మరణించారు.
ఈ నెల 26న కార్డియాక్ అరెస్ట్కు గురైన ఆయనకు ఐదు రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
1974 ఆగస్టు 6న జన్మించిన సుదర్శన్ రెడ్డి, 2018లో ఎమ్మెల్యేగా గెలిచి, అంతకుముందు పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్గా పనిచేశారు.