
మహారాష్ట్రలో పామాయిల్, రసాయనాలతో తయారు చేసే నకిలీ పనీర్ అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించగా, ఉల్లంఘిస్తే 6 నెలల జైలు, రూ.1 లక్ష జరిమానా విధిస్తారు.
ఇటీవల పూణేలో జరిపిన దాడుల్లో 1,400 కిలోల నకిలీ పనీర్, 718 లీటర్ల పామాయిల్, 400 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్ రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ ఆహారం తిని ఎవరైనా మరణిస్తే దోషులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు కనీసం రూ.10 లక్షల జరిమానా విధించేలా నిబంధనలను కఠినతరం చేశారు.