
ప్రధాని నరేంద్ర మోదీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా, రాబోయే కాలంలో దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కీలక ప్రణాళికలను ప్రకటించారు.
ప్రజలందరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, స్వయం సమృద్ధి సాధన దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.