
కాకినాడలో తన భర్త ద్వారా బలవంతపు మతమార్పిడికి గురయ్యానని ఒక యువతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
ఇటీవల జరిగిన పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటన తర్వాత ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, బాధితురాలి ఆరోపణల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.