
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత 48 గంటలుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది.
నిరంతర వర్షాల వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.