
మెగా డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న దుష్ప్రచారానికి నిరసనగా విజయవాడలో ఆదివారం సుమారు 7 వేల మంది ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుండి అంబేడ్కర్ స్మృతివనం వరకు జరిగిన ఈ ర్యాలీలో టీచర్లు తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.
నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, తమకు ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.