
అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భారత ఏ జట్టుకు ఎంపికయ్యారు.
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ 15 మంది సభ్యుల వన్డే జట్టు అక్టోబర్ 6, 9, 11 తేదీలలో మ్యాచ్లు ఆడనుంది.
గతంలో గాయాల కారణంగా ఆటకు దూరమైన పాండ్యా మైదానంలోకి దిగడం పూర్తిగా ఆయన ఫిట్నెస్ సర్టిఫికేషన్ పైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది.