
వచ్చే ఏడాది ఏప్రిల్ 4 నుంచి 11 వరకు పాకిస్థాన్లో జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్లో పాల్గొనేందుకు భారత్ అంగీకరించినట్లు సమాచారం.
ఈ గేమ్స్ ఇస్లామాబాద్, లాహోర్ మరియు పెష్వార్ నగరాల్లో మొత్తం 28 క్రీడల విభాగాల్లో నిర్వహించనున్నారు.
భారత ఒలింపిక్ అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.