
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల మంగళవారం తెల్లవారుజామున 1.52 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు.
1984లో 'ఛాలెంజ్' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, సుమారు 100 సినిమాల్లో నటించి, చివరగా 2019లో 'మత్తు వదలరా' చిత్రంలో కనిపించారు.
గత కొన్నేళ్లుగా ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగా, పవన్ కల్యాణ్, దిల్ రాజు వంటి వారు కూడా సాయం చేశారు.