
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా బ్యాటర్ లక్ష్య తరేజా కొట్టిన బంతి అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్కు బలంగా తగిలింది.
18వ ఓవర్లో జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంపైర్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఈ సీజన్ ఆరంభంలో కూడా అంపైర్ భరద్వాజ్ భుజానికి బంతి తగిలి గాయపడగా, ఇప్పుడు జరిగిన ఘటనతో టీ20ల్లో అంపైర్లకు హెల్మెట్ తప్పనిసరి చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.