
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి పరాజయం పాలయ్యారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్-5 స్థానంలో ఉన్న భారత జంట 18-21, 9-21 తేడాతో చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయింది.
కేవలం 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ ఓటమితో, గతంలో 2022, 2025లలో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో పతక ఆశలు ముగిశాయి.