
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పెద్దపల్లిలో పేర్కొన్నారు.
హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు, యువత మరియు బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు, సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు.