సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఏరియాలో లోతుకుంట ప్రాంతంలోని 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్దేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం కొట్టివేసింది.
దీంతో తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది.