హైదరాబాద్లోని గోల్కొండ కోట సమీపంలో పురావస్తు శాఖ నిపుణులు 400 ఏళ్ల నాటి పురాతన సొరంగాన్ని గుర్తించారు.
కుతుబ్ షాహీ సమాధుల వద్ద చేపట్టిన తవ్వకాల్లో ఈ రహస్య మార్గం బయటపడటంతో ఆర్కియాలజీ అధికారులు పరిశీలన చేపట్టారు.
ఈ సొరంగం చార్మినార్ వరకు అనుసంధానమై ఉందా అనే కోణంలో నిపుణులు లోతైన అధ్యయనం చేస్తున్నారు.