
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, కేంద్రం అనుమతి లేకుండానే ఈ పర్యటన జరిగిందని విమర్శించారు.
పాకిస్థాన్ అనుకూల వ్యక్తిగా ఆరోపణలున్న న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలవాలని సీఎం నిర్ణయించుకోవడం వల్లే విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు.
అర్హత లేని వ్యక్తులను కలవాలని సీఎం నిర్ణయించుకోవడం అర్ధరహితమని, కేంద్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.