
ఏపీ ప్రభుత్వం మున్సిపల్ (సవరణ) చట్టం-2026ను అమలు చేస్తూ జీవో నంబర్ 210, 211లను జారీ చేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ అభ్యర్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ చేయాలని నిబంధన విధించింది.
అభ్యర్థులు గరిష్ఠంగా 4 సెట్ల నామినేషన్లు మాత్రమే వేయాలని, నేర చరిత్ర మరియు ఆస్తులపై నోటరీ అఫిడవిట్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.