
పరీక్షల నిర్వహణలో ప్రశ్నపత్రాలను రూపొందించేవారి నిజాయితీ, విశ్వసనీయతలే అతిపెద్ద సవాల్ అని టాస్క్ఫోర్స్ సభ్యుడు వి.కామకోటి పేర్కొన్నారు.
కేంద్రం నియమించిన పరీక్షల సంస్కరణల టాస్క్ఫోర్స్లో మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ప్రశ్నపత్రాల రూపకర్తల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.