
ఆగస్టు 28 నుంచి దుబాయ్లో ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో, సెప్టెంబర్ 5న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో గ్రూప్-ఎలో భారత్, పాక్, థాయ్లాండ్, హాంకాంగ్ ఉండగా, సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్లు ప్రారంభం కానుండగా, భారత్ గతంలో 2012, 2016, 2022లలో టైటిల్ గెలుచుకుంది.