
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల అనుమతించిన పరిధికి బయట ఉన్న అక్రమ క్యూలైన్ ఏర్పాట్లు, బారికేడ్లను భారత అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు.
ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాక్ ఇలాంటి చర్యలకే పాల్పడిన మూడు రోజులకే భారత అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరోవైపు జమ్మూకశ్మీర్ పర్యటనలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఇస్లామాబాద్లోని అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ నాటలీ బేకర్ను పాక్ విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది.