
బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా నేడు హాకీ ప్రపంచకప్-2026 ప్రారంభం కానుండగా, హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు తన తొలి మ్యాచ్లో వేల్స్తో తలపడనుంది.
మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ పూల్-డిలో ఉండగా, 17న ఇంగ్లాండ్, 19న పాకిస్థాన్తో లీగ్ మ్యాచ్లు ఆడనుంది.
1975 తర్వాత పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత్, కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ పర్యవేక్షణలో ఆగస్టు 30న ముగిసే ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతోంది.