
అవినీతి ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో 15 బృందాలు శ్రీనివాస్ రెడ్డి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టాయి.
గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా పనిచేసిన సమయంలో కూడా ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.