
నల్గొండ జిల్లాలో ఈనెల 11న నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని అదే పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు దారుణంగా హత్య చేశారు.
ఈ హత్యకు నిరసనగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో గల గార్డియన్ స్కూల్ ప్రిన్సిపాల్ మహమ్మద్ అంకూస్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.
విద్యార్థుల్లో పెరుగుతున్న చెడు అలవాట్లను అరికట్టడానికి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిత్యం పర్యవేక్షించాలని ఉపాధ్యాయ బృందం విజ్ఞప్తి చేసింది.