
విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.
తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.