
వెలిగొండ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న మార్కాపురం, అర్ధవీడు, పెద్దారవీడు మండలాల్లోని 11 గ్రామాల విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
ఈనెల 31న వెలిగొండ ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్కు నీళ్లు నింపే కార్యక్రమం ప్రారంభం కానుండటంతో, 10 పాఠశాలల్లోని 769 మంది విద్యార్థులకు ప్రత్యామ్నాయ పాఠశాలలు కేటాయించారు.
పెద్దారవీడు మండలం సుంకేసుల ఉన్నత పాఠశాలలోని 216 మంది విద్యార్థులను మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ పాఠశాలలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు, జిల్లాలోని ఏ పాఠశాలలోనైనా చేరే అవకాశం కల్పించారు.