
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు బుధవారం సోదాల అనంతరం గురువారం ఉదయం అరెస్ట్ చేశారు.
తిరుపతి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల నగదును ఏసీబీ గుర్తించింది.
లోకనాథం భార్య, కుమారుడి పేర్లతో ఉన్న ఇళ్లు, స్థలాలను ఏసీబీ అధికారులు గుర్తించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.