
బలూచిస్థాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతూ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ ఆగస్టు 11న అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
1947 ఆగస్టు 11న బలూచిస్థాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుందని, తమ ఉద్యమం దౌత్యపరమైన గుర్తింపు కోసం కొత్త దశలోకి ప్రవేశించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకలను అడ్డుకునేందుకు పాకిస్థాన్ అధికారులు బలూచిస్థాన్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేయడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.