మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉందని పేర్కొంటూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు, నదుల అనుసంధానానికి నిధులు కేటాయించాలని కోరారు.
అత్యాచారాలు, పోక్సో కేసుల విచారణను సీఎం స్థాయిలోనే పర్యవేక్షించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో స్పష్టం చేశారు.