నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు జరగనుండగా, ఒక్కో షేరు ధరను రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు.
ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో సాగనుండగా, ముందుగా తలపెట్టిన రూ. 30 వేల కోట్ల పరిమాణాన్ని తగ్గించి రూ. 22,569 కోట్లకు కుదించారు.
బిడ్డింగ్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 22న షేర్ల అలాట్మెంట్ పూర్తి చేసి, సెప్టెంబర్ 24న స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయనున్నారు.