
దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని, మానవాళి వికాసానికి ఈ దేశాలు కృషిచేస్తాయని చెప్పారు.
పరస్పర సహకారంతో సుస్థిరాభివృద్ధి సాధించాలని, గ్లోబల్ సౌత్ దేశాలు నియమాలు రూపొందించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్న యుద్ధాలు, ఘర్షణల ప్రభావం సామాన్యుల జీవితాలపై పడుతోందని, సవాళ్లను సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.