
ఆగస్టు 15న కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గీతాన్ని సోనియా గాంధీ ఆపాలని సూచించారని బీజేపీ నేతలు ఆరోపించారు.
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ జాతీయ గేయాన్ని అవమానించిందని విమర్శిస్తూ క్షమాపణలు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఆగస్టు 16న కర్ణాటకలోని ఉర్వా పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు సోనియా గాంధీపై ఫిర్యాదు చేయగా, కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.