
హైదరాబాద్లోని 14 డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ బృందాలు జరిపిన దాడుల్లో రసాయనాలతో పన్నీర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ తనిఖీల్లో రూ.7.19 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన మూడు యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను రద్దు చేశారు.
పన్నీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వంటి రసాయనాలను వాడుతున్నట్లు తేలడంతో, 21 శాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు.