
గాలే వేదికగా జరగనున్న భారత్-శ్రీలంక తొలి టెస్టు మ్యాచ్కు వర్షం కారణంగా తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అక్యూవెదర్ సూచన ప్రకారం 90 శాతం వర్షం పడే అవకాశం ఉండటంతో పాటు, గంటకు 20 నుండి 43 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
భారత జట్టు తన 600వ టెస్టు మ్యాచ్ ఆడుతుండగా, గాలే స్టేడియం ఆసియాలో 50 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక మైదానంగా రికార్డు సృష్టించనుంది.