
2027 వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆగస్టు 28 నుంచి టీ20 ముక్కోణపు సిరీస్ను నిర్వహించనున్నాయి.
నమీబియా రాజధాని విండ్హోక్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో సెప్టెంబర్ 6న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
24 ఏళ్ల విరామం తర్వాత ఆఫ్రికా ఖండంలో వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో, ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా కీలక పాత్ర పోషించనుంది.