
ఆస్ట్రియాలోని మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్లో ఇద్దరు దుండగులు 200 క్యారెట్ల ప్లాటినం-వజ్రాల హారాన్ని దొంగిలించి పరారయ్యారు.
ఈ హారంలో 673 అరుదైన రత్నాలు ఉన్నాయని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
దుండగులు సుత్తితో అద్దాల పెట్టెను పగులగొట్టి చోరీకి పాల్పడిన దృశ్యాలు నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు.