తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉన్న జీవో 25ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ జీవో వల్ల పాఠశాలల విలీనం జరుగుతుందని, దీనిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.