
టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతుండటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
శ్రీలంక పర్యటనకు ఐదుగురు క్రికెటర్లు గాయాల కారణంగా దూరమైన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని సందర్శిస్తున్న సైకియా, హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్తో ఫిట్నెస్ నిబంధనలపై చర్చించనున్నారు.