
తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రమాదకరమైన రోడ్లు, కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు.
ఈఎన్సీ నుంచి ఏఈ స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రతిరోజూ రిపోర్టులు అందించాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.