
హైడ్రా ఉద్యోగాల కోసం సరూర్నగర్ స్టేడియానికి వచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.