
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు.
ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయమని వెంకయ్యనాయుడు అభివర్ణించారు.
న్యాయస్థానం వెలువరించిన ఈ కీలక నిర్ణయం సమాజంలో నిజాయతీగా పనిచేసే వారికి గొప్ప భరోసాను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.