
ప్రసవం తర్వాత రోగనిరోధక వ్యవస్థలో మార్పుల వల్ల థైరాయిడ్ గ్రంథిలో వాపులు వచ్చి 'పోస్ట్పార్టమ్ థైరాయిడిటిస్' వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఎదురవుతుందని, ఇది తాత్కాలికమేనని, జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
టీపీవో యాంటీబాడీల స్థాయిని పరీక్షించుకోవడం ద్వారా సమస్య తీవ్రతను, అది శాశ్వతమా కాదా అనేది నిర్ధారించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.