
ఉత్తర బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సెప్టెంబర్ 9న వెల్లడించారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
రేపు (గురువారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, శుక్రవారం (సెప్టెంబర్ 11) కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.