
టర్కీలోని ఇస్తాంబుల్ తీరం సిలివ్రికి 18 నాటికల్ మైళ్ల దూరంలో 'అల్సు', 'తుగ్బర్క్ ఇమామోగ్లు' అనే రెండు వాణిజ్య నౌకలు మంగళవారం తెల్లవారుజామున ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో 'తుగ్బర్క్ ఇమామోగ్లు' నౌకలోని 10 మంది సిబ్బంది గల్లంతయ్యారని, వారు సముద్రంలో మునిగిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రమాద స్థలి వద్ద 14 రెస్క్యూ నౌకలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.